తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. తిరుపతిలో ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు (ఏప్రిల్ 3, శనివారం) తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ముందుగా బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభకు మద్దతుగా తిరుపతి పట్టణంలోని ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ నుంచి ఏఐఆర్ బైపాస్ మీదుగా శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేయనున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర అనంతరం శంకరంబాడి సర్కిల్ (అన్నపూర్ణ టెంపుల్ వద్ద) వద్ద జరగనున్న భారీ బహిరంగసభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు. పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయడానికి బీజేపీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ