జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 21 న తిరుపతికి రానున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. “జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.) సమావేశం ఈ నెల 21 వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరుపతి నగరంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు” అని జనసేన పార్టీ ప్రకటనలో వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ