జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 23, శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ జిల్లాలోప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. “ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా నిలిచేందుకు ఈ నెల 23వ తేదీన జనసేన పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడికి వెళతారు. ఆత్మహత్య చేసుకున్న కొంతమంది కౌలు రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి మార్గం మధ్యలో పరామర్శిస్తారు. జనసేన పార్టీ తరపున రూ.లక్ష పరిహారం అందిస్తారు” అని తెలిపారు.
అనంతరం చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బలవన్మరణాలకు పాల్పడిన మరికొంత మంది రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా చింతలపూడిలో లక్ష రూపాయల చెక్కులు అందచేస్తారు. మరోవైపు ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన మొదటి విడత కౌలు రైతు భరోసా యాత్రలో 31 మంది కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ