జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగస్టు 20, శనివారం నాడు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారని తెలిపారు.
అనంతరం రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని, రైతు కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారని చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొంటారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో పూర్తయ్యింది. అలాగే ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో కూడా తొలి విడత పూర్తయిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY