తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఆయనకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. నిన్న ఆయనకు కొద్దిపాటి జలుబు, స్వల్ప జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్తగా కరోనా పరీక్ష చేయించుకోగా రిజల్ట్స్ లో స్పీకర్కు పాజిటివ్గా తేలింది. దీంతో స్పీకర్ పోచారం బాన్సువాడలోని తన స్వగృహంలో హోం ఐసొలేషన్లోకి వెళ్లిపోయారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో గడచిన కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా సోకడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY