ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు “న్యాయస్థానం టూ దేవస్థానం” పేరుతో మహా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా ఈ యాత్ర కొనసాగించి తిరుమలలో ముగించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి రైతులకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు శుక్రవారం నాడు పాదయాత్రలో పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
“జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలోని బృందం ఈ రోజు (నవంబర్ 26) రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొంటుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ చేపట్టిన ఈ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిధిలో ఉంది. నార్త్ రాజుపాలెం నుంచి నెల్లూరు వెళ్లే మార్గంలో జనసేన నేతలు, జన సైనికులు పాదయాత్రలో పాల్గొంటారు” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ