మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా పూణే, ముంబయి, థానే, నాగ్ పూర్ వంటి నగరాల్లో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పూణే నగరంలో మహారాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలను అమల్లోకి తెస్తుంది. శనివారం నుంచి వారం రోజుల పాటుగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 12 గంటల పాటు నైట్ కర్ఫ్యూ విధించనున్నట్టు పూణే డివిజినల్ కమిషనర్ వెల్లడించారు. అలాగే వారం రోజుల పాటు పూణే నగరంలో బార్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్ మూసివేయబడతాయని చెప్పారు. హోమ్ డెలివరీ మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు.
అంత్యక్రియలు మరియు వివాహాలు మినహా ఇతర ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు అనుమతించబడవని, అంత్యక్రియల కోసం గరిష్టంగా 20 మందిని, వివాహాల్లో 50 మందిని మాత్రమే అనుమతిస్తామని అన్నారు. అలాగే మతపరమైన ప్రదేశాలు పూర్తిగా మూసివేయబడతాయని, శనివారం నుంచే ఈ ఆదేశాలు అన్ని అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు. మళ్ళీ ఏప్రిల్ 9, శుక్రవారం కరోనా పరిస్థితిని సమీక్షించి, ఈ ఆదేశాలపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నట్టు ముంబయి మేయర్ కిశోరీ పడ్నేకర్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ