దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసరావు కి కరోనా పాజిటివ్ గా తేలగా, తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్కు గురువారం నాడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలినట్టు పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేను ఐసోలేషన్ వార్డుకు తరలించి, వైద్యులు చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటివరకు కర్నూల్ జిల్లాలో 1615 కరోనా కేసులు నమోదవగా, రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 11489 కు చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu