ఏపీలో కొత్తగా 605 మందికి కరోనా పాజిటివ్, 146 కి చేరిన మరణాలు

AP Corona Updates: 605 New Positive Cases, 10 Deaths Reported in Last 24 Hours

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 605 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 570 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34, విదేశాల నుంచి వచ్చిన వారు ఒక్కరు ఉన్నారు. కొత్తగా నమోదైన 605 కేసులతో కలిపి జూన్ 26, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11489 కు చేరింది. గత 24 గంటల్లో 22,305 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. ఈ కేసుల్లో 9353 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2136 మంది ఉన్నారు.

మరోవైపు కృష్ణాలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, గుంటూరులో ఒకరు మరియు విశాఖపట్టణంలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 146 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికి 5196 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 6147 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =