ఏపీలోని త్వరలోనే రానున్న ఎన్నికల కోసం అధికార వైసీపీని గద్దె దించడానికి టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి రెడీ అవుతోంది. పొత్తుల్లో భాగంగా 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పటికే ప్రకటించిన జాబితాలో మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల సమయంలో వైసీపీకి గుడ్బై చెప్పి.. జనసేనలో చేరిన సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరికి టికెట్ ఇస్తారన్న వార్తలు ముందు వినిపించినా తర్వాత మాత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించక పోవడంతో.. బాలశౌరి పొలిటికల్ ప్యూచర్ ఏంటనే చర్చ సాగింది. దీనికి తోడు బాలశౌరికి స్థానంలో మరికొందరి పేర్లను కూడా పరిశీలిస్తున్నారనే ప్రచారం వినిపించింది.
మొత్తంగా మచిలీపట్నం లోక్సభ అభ్యర్థినిపై నెలకొన్న సస్పెన్స్కు తెరదించుతూ..కాసేపటి క్రితం ఒక ప్రకటనను పవన్ కల్యాణ్ విడుదల చేయడంతో ఉత్కంఠకు తెర దించినట్లు అయింది.మచిలీపట్నం లోక్సభ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్ధిగా వల్లభనేని బాలశౌరి పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ,బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 21 శాసన సభ స్థానాలు, రెండు లోక్సభ స్థానాలకు పోటీ చేస్తుందనే విషయం తెలిసిందే. అయితే అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
అవనిగడ్డ నుంచి పోటీకి ఎక్కువ మంది పోటీ పడుతుంటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనేదానిపై అక్కడ సర్వే జరుగుతోన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఫలితాలు వచ్చాక తమ అభ్యర్థిని ప్రకటిస్తామని జనసేన అధిష్టానం ప్రకటించింది. మొత్తంగా చూస్తే ఇంకా 3 అసెంబ్లీ స్థానాలను జనసేనాని పెండింగులో పెట్టారు. విశాఖ సౌత్ నుంచి వంశీ కృష్ణ యాదవ్ పేరు దాదాపు ఖరారయినట్టుగానే తెలుస్తోంది. కానీ, అవనిగడ్డ, పాలకొండ సెగ్మెంట్లల్లో అభ్యర్థులపైనే కసరత్తు కొనసాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE