తూర్పుగోదావరి జిల్లాలో బాలుడు జషిత్ కిడ్నాప్ కేసు సంచలనం సృష్టిస్తుంది. మండపేట మండలంలోని విజయలక్ష్మీ నగర్లో అపహరణకు గురైన బాలుడు జషిత్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు, స్థానికంగా ఉన్న సాయి ధరణి అపార్ట్ మెంట్ వద్ద నానమ్మతో వెళ్తున్న ఐదు సంవత్సరాల వయసున్న బాలుడు జషిత్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కుమారుడి అపహరణపై తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు, తల్లితండ్రులు ఇద్దరు బ్యాంకు ఉద్యోగులుగా పని చేస్తున్నారు. అపహరణ గురై మూడు రోజులు అవ్వడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, తమ బిడ్డను ఎలాగైనా రక్షించాలంటూ పోలీసులను కోరుతున్నారు.
మరో వైపు పోలీసులు ఇప్పటికే 7 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు మొదలు పెట్టారు,తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ హస్మీ మాట్లాడుతూ అన్ని చెక్ పోస్టులు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్ లో గాలింపు చర్యలు చేపడుతున్నామని, అన్ని చోట్ల పోలీసులను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. అపహరణలో ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన కోణం పై విచారణ జరుపుతున్నామన్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించి దుండగులను గుర్తించామని, ముగ్గురు వ్యక్తులు అపార్ట్ మెంట్ వద్ద రెక్కీ నిర్వహించారని, అక్కడ జనం ఉండడంతో, బాలుడు ఇంటి దగ్గరకు వెళ్లేవరకూ వేచి చూసి బాలుడిని అపహరించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు ముఖానికీ కర్చీఫ్ కట్టుకొని, రాత్రి కరెంటు లేని సమయంలో వాళ్ళు ఈ ఘటనకు పాల్పడినట్టు చెబుతున్నారు, మరియు జషిత్ అపహరణ ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=03ls36gVAYY]