ఈనెల 11న విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ, పూర్తి షెడ్యూల్ ఇదే

PM Modi Vizag Tour Schedule Finalized For Launching of Several Project Works on November 11, Prime Minister Modi Visakhapatnam Tour on Nov 11th, Prime Minister Modi Visakhapatnam Tour, Prime Minister Visakhapatnam Tour, PM Narendra Modi will Visit Visakhapatnam, Mango News, Mango News Telugu, PM Modi Visakhapatnam Tour, Modi Tour To Visakhapatnam, Visakhapatnam Latest News And Updates, PM Modi Tour Live Updates, PM Narendra Modi Visakhapatnam Tour, National News, National Politics, Modi Inaugurating Several Development Projects

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ రెండు రోజుల పాటు విశాఖలోనే ఉండనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం విశాఖపట్నంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం ఉద్యమం చేస్తోంది. మరోవైపు అమరావతినే ఏపీ రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కాగా తాజాగా ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఖరారు అయింది.

ప్రధాని మోదీ వైజాగ్ పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే..

  • ప్రధాని మోదీ నవంబర్ 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు చేరుకోనున్నారు.
  • ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. ఇక ఆ రోజు రాత్రికి ప్రధాని విశాఖలోనే బస చేస్తారు.
  • నవంబర్ 12 ఉదయం రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ విస్తరణ, ఈస్ట్‌కోస్టు జోన్‌ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు.
  • తర్వాత రూ. 26 వేల కోట్లతో చేపట్టిన హెచ్‌పిసిఎల్ పెట్రోలియం రిఫైనరీ విస్తరణ మరియు ఆధునికీకరణ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించనున్నారు.
  • అనంతరం రూ. 260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్‌ వర్క్ షాపును ప్రారంభించనున్నారు.
  • ఆ తర్వాత విశాఖపట్నంలోని క్రూయిజ్ టెర్మినల్ యొక్క మొదటి దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
  • అలాగే రూ. 445 కోట్లతో ఐఐఎం యొక్క ఆధునిక ఎకో విధానంలో రూపొందిన కొత్త క్యాంపస్ ను ప్రారంభిస్తారు.
  • ఇక చివరిగా ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 19 =