తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. బుధవారం ఉదయం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్ ఫలితాలను వెల్లడించారు. జూన్ 7 నుంచి 14 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు, మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన 1,52,384 విద్యార్థులు, మార్కులు పెంచుకోవడం కోసం ఇంప్రూవ్ మెంట్ కింద మరో 1,48,463 మంది విద్యార్థులుతో కలిపి మొత్తం 3,00,847 విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు.
ఇంటర్ సెకండియర్ ఫలితాలను ఈనెల 14 వ తేదీన విడుదల చేయగా, మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలును ఈ రోజు విడుదల చేసారు. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఈ సంవత్సరం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాల వలన విద్యార్థులు, రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లితండ్రులు ధర్నాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకొని, ఎటువంటి తప్పులు దొర్లకుండా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలను విడుదల చేసారు.
[subscribe]
[youtube_video videoid=AKzQgwP7d_0]