ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు కలుసుకున్నారు. నవంబర్ 20 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాలను మంత్రాలయం నుండి ప్రారంభించాలని సీఎంకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు మఠం ప్రతినిధులు వేద ఆశీర్వచనం ఇచ్చి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu