ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాజరు విషయమై ప్రభుత్వ ఉపాధ్యాయుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం కొత్తగా ఒక ఫేషియల్ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఉద్యోగులు అంతగా ఉత్సాహం చూపడం లేదు. ఒకవైపు ఇది తప్పనిసరి అంటూ ప్రభుత్వం ప్రకటించగా.. మరోవైపు ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దీనిపై చర్చించేందుకు ఉద్యోగులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ యాప్పై ఒక విధానం తీసుకుందని, అయితే సమన్వయ లోపం వల్లే కొంత గందరగోళం నెలకొందని తెలిపారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లో దీనిని అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ముందుగా ఉపాధ్యాయులను వినియోగించాలని కోరామని వివరించారు. అయితే యాప్ వినియోగంలో ఉద్యోగులకు కొన్ని సందేహాలు ఉన్నట్లు తెలిసిందని, వాటిని నివృత్తి చేసేందుకే సమావేశం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మొత్తం లక్షా 90 వేల మందికి గాను లక్ష మంది ఉద్యోగులు ఇప్పటికే ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగిలిన వారు కూడా వీలైనంత త్వరగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ముందుగా 15 రోజుల పాటు ఈ యాప్ వాడకంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, ఆ తర్వాతే యాప్ అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY