ప్రతి ఏడాది ఆగస్టు 22న అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా “మెగా కార్నివాల్” పేరుతో నిర్వహించనున్న వేడుకల వివరాలను మెగా బ్రదర్ నాగబాబు గురువారం మీడియాకు వివరించారు. ప్రతిసారి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈసారి ఇంకా కొత్తగా జరపబోతున్నామన్నారు. లక్షలాది మంది అభిమానులతో ఆగస్టు 21న హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా ఈసారి మెగా కార్నివాల్ జరుగుతుందన్నారు. అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఫెస్టివల్ గా మారిందని, ఈసారి కార్నివాల్ పద్దతిలో జాతరగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి మెగా అభిమాని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా వేడుకలు ఉంటాయన్నారు. ఇప్పటివరకు ఈ పద్ధతిలో ఇండియాలో ఏ సినిమా హీరోకు వేడుకలు జరగలేదని, తొలిసారి చిరంజీవి పేరిట తలపెట్టడం మెగాభిమానులకు గర్వకారణమన్నారు. ప్రతి అభిమాని హాజరుకావచ్చని నాగబాబు పేర్కొన్నారు.
ఏ ఫలితం ఆశించకుండా, మానవతాదృక్పధంతో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టిన చిరంజీవికి లెజెండ్ అనే మాట కూడా తక్కువేనని అన్నారు. వేడుకలు సందర్భంగా చిరంజీవి గురించి ఎవరికీ తెలియని కొన్ని సంఘటనల గురించి చెబుతానని నాగబాబు చెప్పారు. చిరంజీవి పుట్టిన రోజంటే తమ కుటుంబంలో అతి పెద్ద పండగని నాగబాబు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో మెగా హీరోలంతా పాల్గొంటారని, అలాగే పలువురు హీరోలు, దర్శకులు కూడా హాజరవుతారని నాగబాబు తెలిపారు. ఈ సమావేశంలో ముందుగా మెగా అభిమానుల సమక్షంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన మెగా కార్నివాల్ పోస్టర్ ను నాగబాబు ఆవిష్కరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY