త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు (మే 12, గురువారం) ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. 2022 జూన్ నుంచి ఆగస్టు వరకు 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది సభ్యుల పదవీకాలం పూర్తికానుండడంతో ఆ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రభు సురేష్ ప్రభాకర్, టీజీ వెంకటేష్, యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), వి.విజయసాయి రెడ్డి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ ల యొక్క పదవీకాలం జూన్ 21, 2022తో పూర్తవనుంది. ఇక మిగిలిన కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, బీహార్, ఛత్తీస్ గఢ్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి 13 రాష్ట్రాల్లో అన్ని కలిపి మొత్తం 51 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్:
- రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్: మే 24, 2022
- నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు: మే 31
- రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన: జూన్ 1
- నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: జూన్ 3
- రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహణ: జూన్ 10 (ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్)
- ఓట్ల లెక్కింపు పక్రియ: జూన్ 10 (సాయంత్రం 5 గంటల నుంచి)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF