జనసేన పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు అండగా ఉంటున్నారు నాగబాబు. గత లోక్ సభ ఎన్నికల్లో నాగబాబు జనసేన తరుపున నరసాపురం నుంచి బరిలోకి దిగారు. కానీ వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు చేతిలో ఓటమిపాలయ్యారు. మూడోస్థానంలో నిలిచారు. అప్పటి నుంచి ఆయన జనసేనలో క్రియాశీలకంగా కొనసాగుతూ.. పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి నాగబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్.. అన్నకోసం స్థానాన్ని కూడా ఫైనల్ చేశారట.
అయితే మొన్నటి వరకు కూడా నాగబాబు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారని ఊహాగాణాలు వెలువడ్డాయి. కొద్దిరోజులుగా తిరుపతి నియోజకవర్గం నుంచి జనసేనాని పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. కానీ ఇటీవల ఆ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ కాకుండా.. నాగబాబు బరిలోకి దిగుతారని గుసగుసలు వినిపించాయి. స్వయంగా పవన్ కళ్యాణ్.. నాగబాబును తిరుపతి నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా నాగబాబును లోక్ సభ ఎన్నికల బరిలోకి దించేందుకు పవన్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు టీడీపీ రెండు లోక్ సభ స్థానాలు కేటాయించిందట. అందులో ఒకటి కాకినాడ కాగా.. మరొకటి మచిలీపట్నం. అయితే ఆ రెండు స్థానాలకు కూడా జనసేన నుంచి బలమైన అభ్యర్థులు ఉన్నారు. మచిలీపట్నం నుంచి జనసేన తరుపున వైసీపీ నుంచి వచ్చిన ఎంపీ బాలశౌరి బరిలోకి దిగుతుండగా.. కాకి నాడ నుంచి సాన సతీశ్ కుమార్ పోటీ చేస్తున్నారట. ఈ రెండు స్థానాలకు వారిద్దరిని జనసేనాని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబు కోసం మరో స్థానాన్ని ఇవ్వాలని పవన్.. టీడీపీని కోరుతున్నారట. అనకాపల్లిని తమకు కేటాయించాలని అడుగుతున్నారట. ఆ స్థానం తమకిస్తే.. నాగబాబును అక్కడి నుంచి పోటీ చేయించాలని పవన్ అనుకుంటున్నారట. ఆ స్థానం కోసం పవన్ కళ్యాణ్ టీడీపీ వద్ద కాస్త గట్టిగానే పట్టుపడుతున్నారట. అటు టీడీపీలో కూడా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం పెద్ద ఎత్తున నేతలు పోటీపడుతున్నారు. మరి ఈ సమయంలో చంద్రబాబు అనకాపల్లిని జనసేనకు ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY