ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 909 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 16, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,94,606 కు, మరణాల సంఖ్య 13660 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1543 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,63,728 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,218 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(909):
- తూర్పుగోదావరి – 241
- నెల్లూరు – 174
- చిత్తూరు – 107
- ప్రకాశం – 86
- గుంటూరు – 82
- విశాఖపట్నం – 61
- కృష్ణా – 47
- కడప – 40
- శ్రీకాకుళం – 28
- పశ్చిమగోదావరి – 21
- విజయనగరం – 9
- కర్నూల్ – 8
- అనంతపూర్ – 5
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ