తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరియు బ్రాహ్మణి దంపతులు మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి విరాళం అందజేశారు. కుమారుడు నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా వారు రూ.33 లక్షల విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమం కోసం ఒకరోజుకు సరిపడా ఖర్చును, అంటే రూ.33 లక్షల భారీ విరాళాన్ని అందించారు నారా లోకేష్ దంపతులు. ఈ మేరకు టీటీడీ శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లోని డిజిటల్ బోర్డుల్లో ప్రదర్శించడం విశేషం. అలాగే మరోవైపు దేవాన్ష్ పేరున టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈరోజు రాష్ట్రమంతటా అన్నదానం చేస్తున్నారు. కాగా ప్రతి సంవత్సరం నారా లోకేష్-బ్రాహ్మణి దంపతులు తమ కుమారుడి పుట్టినరోజును పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణకు విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE