తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కడప సెంట్రల్ జైలులో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కడప విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్కు కడప జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇక స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా వాహనాల్లో చేరుకొని లోకేష్ పర్యటనలో పాల్గొన్నారు. కాగా విమానాశ్రయంలో పార్టీ ముఖ్యనేతలు, ఇన్ఛార్జ్ లతో కొద్దిసేపు భేటీ అయిన లోకేష్ అనంతరం, ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన కడప సెంట్రల్ జైలుకు బయలుదేరారు. అక్కడ ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించనున్నారు.
అయితే లోకేష్ పర్యటన సందర్భంగా పట్టణంలో మరియు సెంట్రల్ జైలు పరిసరాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. కాగా డ్వాక్రా మహిళలపై దాడి ఘటనలో ప్రవీణ్ కుమార్ రెడ్డిని గతవారం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఇక ప్రవీణ్ కుమార్ అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పార్టీలోని కీలక నేతలందరూ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, దీనిలో భాగంగానే తమ నేతలపై అక్రమ కేసులు పెడుతోందంటూ వారు విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY