ఏపీలో నేటి నుంచి నాలుగురోజుల పాటు రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర

Rahul Gandhi Bharat Jodo Yatra Enters into Kurnool District Andhra Pradesh Continue till Oct 21st, Rahul Gandhi Bharat Jodo Yatra Enters into Andhrapradesh, Bharat Jodo Yatra Enters into Andhrapradesh, Bharat Jodo Yatra Route Map Finalized, Mango News, Mango News Telugu, Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi , Rajiv Gandhi, Priyanka Gandhi, Sonia Gandhi, Rahul Gandhi Latest News And Updates, Andhrapradesh News And Live Updates

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ అక్టోబర్ 18, మంగళవారం ఉదయం ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 21 ఉదయం వరకు నాలుగు రోజులు పాటుగా మొత్తం 119 కిమీ మేర ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. ముందుగా కర్నూల్ జిల్లాలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి ఏపీ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికాయి.

మంగళవారం ఉదయం 7 గంటలకు రామాలయం సమీపంలోని హాలహర్వి బస్టాండ్‌ వద్ద నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించి, 9.30 గంటలకు ఆలూరు సమీపంలోని హత్తిబెలగళ్‌ వద్ద ముగించారు. విరామం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ సర్వీస్ స్టేషన్ నుంచి పాదయాత్రను ప్రారంభించి 6.30 గంటలకు మునికుర్తి గ్రామం ఎంపీపీఎస్ స్కూల్ వద్ద ముగిస్తారు. అక్కడ నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. మంగళవారం రాత్రి కర్నూల్ జిల్లా, ఆదోని మండలం చాగి గ్రామంలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు.

ఏపీలో రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర:

  • అక్టోబర్ 19 : బుధవారం ఉదయం 6.30 గంటలకు చాగి నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభం, ఉదయం ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజి వరకు యాత్ర కొనసాగింపు, విరామం అనంతరం ఆదోనిలోని ఆరేకల్ వరకు యాత్ర, ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాత్రికి బస.
  • అక్టోబర్ 20: గురువారం ఉదయం 6.30 గంటలకు ఎమ్మిగనూరు నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం. ధర్మాపురం గ్రామం వరకు కొనసాగింపు, విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు ధర్మాపురం టోల్ గేట్ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు కల్లుదేవర కుంటకు చేరుకోనున్న యాత్ర, మంత్రాలయం అవుట్ కర్ట్స్ లో రాత్రి బస.
  • అక్టోబర్ 21: శుక్రవారం ఉదయం 6.30 గంటలకు మంత్రాలయం టెంపుల్ సర్కిల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం, 9.30 గంటలకు కర్ణాటకలోని రాయచూర్ లోకి ప్రవేశించనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nine =