నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అస్వస్థత గురయ్యారు. శ్రీధర్రెడ్డి గత 47 రోజులుగా తన నియోజకవర్గంలో ‘జగన్ అన్న మాట-కోటంరెడ్డి బాట’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఆమంచర్లలో పర్యటిస్తుండగా ఆయనకు స్పల్ప గుండెపోటు వచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే ఆయనను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా వైద్యుల సూచన మేరకు ఆయన కుటుంబసభ్యులు అక్కడి నుంచి ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ముందుగా సమాచారం అందిన వెంటనే రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసుపత్రిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీధర్రెడ్డి అస్వస్థతకు గురవడంతో ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోగ్యంపై కుటుంబసభ్యులు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF