హైదరాబాద్ నగరంలో సరికొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. జర్మన్ ఆటోపార్ట్స్ మేకర్ జెడ్ఎఫ్ సంస్థ ఈ ఫెసిలిటీ సెంటర్ను హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నిర్మించింది. ఈ మేరకు జెడ్ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ శుక్రవారం తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. దావోస్ వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్తో ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు సమావేశమయ్యారు. 2022 జూన్ 1న జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ సంస్థ ప్రారంభం కాబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
A testimony for Hyderabad in the growing Mobility space. ZF, a German automotive major, announces it’s expansion plan in Hyderabad with 3,000 employees and will be a big part of the Telangana Mobility Valley!! pic.twitter.com/sgnuc5KqiE
— KTR (@KTRTRS) May 27, 2022
సుమారు రూ. 322 కోట్ల వ్యయంతో ఈ ఫెసిలిటీ సెంటర్ను నిర్మించింది జెడ్ఎఫ్ సంస్థ. దాదాపు 3 వేల మందికి దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. జర్మన్ ఆటోపార్ట్స్ మేకర్ అయిన జెడ్ఎఫ్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 100 ఫెసిటీ సెంటర్లు ఉండగా.. మరో 18 డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. తాజాగా, హైదరాబాద్లో కొత్త ఫెసిలిటీ సెంటర్ను నెలకొల్పింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి జెడ్ఎఫ్ రాక వలన మరింత బలం చేకూరుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ