దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 10,809 సెషన్స్ లో 5,71,974 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో జనవరి 30, శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 35 లక్షలకు పైగా (35,00,027) మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి 1,79,038 మంది, తెలంగాణలో 1,66,606 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేశారు. దేశంలో జనవరి 16 న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవగా, కేవలం 14 రోజుల్లోనే 35 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో ముందున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
రాష్ట్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ