త్వరలో భీమవరానికి పవన్ కల్యాణ్

AP Politics 2019, Janasena, Janasena Latest News, Janasena Latest Updates, Janasena Pawan Kalyan, Kalyan, Mango News Telugu, Pawan, pawan kalyan, Pawan Kalyan Latest, Pawan Kalyan Latest News, Pawan Kalyan To Visit Bhimavaram, Pawan Kalyan To Visit Bhimavaram Soon, Pawan Kalyan Visit To Bhimavaram, praja porata yatra

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవలే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరో, 11 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలిసారిగా సమావేశమయింది. ఈ సమావేశానికి ముఖ్యనాయకులు నాదెండ్ల మనోహర్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్,నాగబాబు మరియు కమిటీ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై, పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం.

సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, జనసేన బలోపేతం కొరకు పవన్ కల్యాణ్ అన్ని స్థాయి నాయకుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్టు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత అజెండాలను పక్కనబెట్టి పార్టీ కోసం కృషి చేయాలనీ పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చినట్టు తెలిపారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయనున్నట్టు తెలిపారు. గత ఎన్నికలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేసారని, అనారోగ్యంతో బాధపడుతూ కూడ పార్టీకోసం పని చేసి ఇటీవలే భీమవరంలో చనిపోయిన ఒక అభిమాని కుటుంబాన్ని త్వరలోనే పవన్ కల్యాణ్ పరామర్శిస్తారని చెప్పారు.

 

[subscribe]
[youtube_video videoid=Ji_HHnigQ6E]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =