ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కందుకూరులో జరిగిన సభలో తోపులాట జరగడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సభకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట జరగడంతో కొందరు పక్కనే ఉన్న మురుగుకాల్వలో పడి గాయపడ్డారు. కొందరు ప్రక్కనే ఉన్న బైక్స్ పై పడడం, వారిపై మరికొందరు పడడంతో శ్వాస ఆడక అపస్మారక స్థితికి వెళ్లారు. ఈ ఘటనలో గాయపడిన 13 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా ఇద్దరు మహిళలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారు.
కాగా కందుకూరు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం” అని ప్రధాని మోదీ ప్రకటించారు.
మరోవైపు ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికీ సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభకు వచ్చిన వారంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వచ్చారని, రాష్ట్రం కోసం త్యాగం చేసిన వారి కుటుంబాలకు అండగా ఉంటానని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరపున రూ.10 లక్షల పరిహారాన్ని చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికీ అండగా ఉంటామని, వారి కుటుంబంలో చదువుకుంటున్న పిల్లలను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE