ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతునట్టుగా తెలుస్తుంది. గతకొన్నిరోజులుగా తనను కలిసిన అధికారులు, నాయకులు, కార్యకర్తలందరిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే సూచించారు. మరోవైపు ఏపీలో సెప్టెంబర్ 5 నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,87,331 కి చేరుకుంది. వీరిలో 3,82,104 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 100880 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu