తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ బుధవారం బీఆర్కేఆర్ భవన్లో సీనియర్ మున్సిపల్ అధికారులు, రక్షణ అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని మిలటరీ ప్రాంతం గుండా వెళుతున్న బల్కాపూర్ నాలాకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. టోలీచౌకిలోని నదీం కాలనీ, ఇతర ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నందున మిలటరీ ప్రాంతంలో ఉన్న చెక్డ్యామ్ను తొలగించి పైప్లైన్ వేయాలని అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. బల్కాపూర్ నాలా నుంచి రేతిబౌలి వరకు, మూసీ చివరి వరకు జీహెచ్ఎంసీ, ఆర్మీ అధికారులతో సంయుక్తంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
మిలటరీ ప్రాంతం నుండి టోలీచౌకి వైపు తుఫాను నీటి కాలువను మళ్లించే అవకాశాలను పరిశీలించాలని సీఎస్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, బ్రిగేడియర్ సోమ శంకర్, తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా, కల్నల్ సిద్ధరథ్ నారాయణ్, సంజయ్ జాజు అదనపు సెక్రటరీ డిఫెన్స్ ప్రొడక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జీహెఛ్ఎంసీ, కమిషనర్ లోకేష్ కుమార్, జీహెఛ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, సీసీపీ దేవేందర్ రెడ్డి, సీ.ఈ.కె దేవానంద్, తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE