రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్ నియంత్రణ చర్యలపై చర్చించినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. అలాగే కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తీసుకుంటున్న తగిన చర్యల గురించి ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ చర్చించినట్టు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో కూడా ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి ప్రస్తుత కరోనా పరిస్థితులపై చర్చించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ