గుంటూరు జిల్లాలోని సంఘం డైరీకి సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సంగండైరీని ఆధీనంలోకి తీసుకుంటు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు నిలిపివేసింది. ఇటీవల సంగం డైరీని తెనాలి సబ్ కలెక్టర్ కు స్వాధీన పరుస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 19 ని జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాల్ చేస్తూ సంగం డైరీ డైరెక్టర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదన విన్న అనంతరం జీవోను నిలుపుదల చేస్తూ శుక్రవారం నాడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డైరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుందని కోర్టు పేర్కొంది. డైరెక్టర్ల బోర్డు సంగం డైరీ కార్యకలాపాలను యధాతధంగా నిర్వహించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే డైరీ స్థిర, చరాస్తులను అమ్మాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ