జనసేనకు బై చెప్పిన పోతిన మహేష్

Pothina Mahesh Resign To Jana Sena Party, Pothina Mahesh Resign, Pothina Mahesh, Vijayawada West Constituency,TDP, Janasena, BJP, Chaudhary Resigned From Janasena Party, Pawan Kalyan, Jana Sena Party Political News, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pothina Mahesh, Vijayawada West Constituency,TDP, Janasena, BJP, Chaudhary resigned from Janasena party, Pawan Kalyan,

కొద్ది రోజులుగా అసంతృప్త రాగం పాడుతున్న జనసేన సీనియర్ నేత పోతిన మహేష్.. చివరకు ఆ పార్టీకి  రాజీనామా చేశారు. జనసేనలో సుదీర్ఘకాలం నుంచి పని చేస్తూ వస్తోన్న పోతిన  చివరకు జనసేనానిపై ఆరోపణలు చేస్తూ పార్టీని వీడిపోయారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతిన టికెట్‌ను ఆశించగా పొత్తులో భాగంగా ఆయనకు నిరాశ ఎదురయింది. 2019 ఎన్నికలలో పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి  పోటీ చేసి ఓడిపోయారు.

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటును భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ  చేయబోతున్నారు. అయితే  తనకు టికెట్ దక్కకపోవడంతో మహేష్  జనసేన పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు పంపించినట్లు తెలిపారు.

కొద్ది రోజులుగా పోతిన మహేష్ పార్టీ మార్పుపై వార్తలు వినిపిస్తున్నా..  ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో  ఉండటంతో పార్టీ మారరు అని కొంతమంది భావించారు. కానీ.. కొంతమంది మాత్రం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ వార్తలు వినిపించాయి. అయితే రాజీనామా తర్వాత ఆయన మాట్లాడిన మాటల తర్వాత అధికార వైసీపీలో చేరనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. సిట్టింగ్ ఎంపీ, విజయవాడ లోక్‌సభ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని ఇప్పటికే పోతినతో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు.

ఈ మధ్య జనసేనకు చెందిన ముమ్మిడివరం, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజాబాబు జనసేన పార్టీకి రాజీనామా చేసి..వైసీపీ గూటికే చేరారు. వారిద్దరూ తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొన్నట్లే పోతిన కూడా ఆ పార్టీ కండువా కప్పుకోవడానికే  జనసేనకు రాజీనామా చేశారు. దీనికోసం ఇప్పటికే పోతినకు కావాల్సిన క్లారిటీ వచ్చేసిందని..అందుకే జనసేన అధినేతపై  కాస్త ఘాటు విమర్శలు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడలో అడుగు పెట్టాక కానీ..ఉగాది రోజు కానీ ఆ పార్టీ కండువా కప్పుకొంటారని ప్రచారం జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =