టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, డైరెక్టర్ నంద్యాల రవి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనాబారిన పడిన ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నంద్యాల రవి పలు సినిమాలకు రచయితగా పనిచేశారు. అనంతరం లక్ష్మీ రావే మా ఇంటికి అనే సినిమాతో దర్శకుడిగా మారారు. అలాగే ఇటీవల వచ్చిన ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే సినిమాలకు కూడా రచయితగా పనిచేశారు. నంద్యాల రవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ