తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సినీ నిర్మాతల మధ్య ఇటీవల పలుమార్లు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం కూడా పలువురు తెలుగు సినీ నిర్మాతలు సచివాలయంలో ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దిల్ రాజు, వంశీ, బన్నీ వాసు, పంపిణీదారు అలంకార్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమా టికెట్ల విక్రయాల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ అంశం, ఇతర సినీ పరిశ్రమ సంబంధిత సమస్యలపై మంత్రి తో నిర్మాతలు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంపై నిర్మాత దిల్రాజు స్పందిస్తూ, ప్రభుత్వం కొంత సమాచారం అడిగిందని, ఆ సమాచారం ఇవ్వడానికే మంత్రిని కలిసినట్టుగా తెలిపారు. కాగా ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వ పోర్టల్ ఏర్పాటు నేపథ్యంలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనల ఆర్డినెన్స్ కు గురువారం ఏపీ కేబినెట్
ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మంత్రి పేర్ని నానితో నిర్మాతలు భేటీ కావడం ప్రాధానత్య సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ