మునుగోడు ఉపఎన్నిక: జోరు పెంచిన బీజేపీ, నేటినుంచి ప్రచారంలోకి బండి సంజయ్

Munugode By-poll Telangana BJP Chief Bandi Sanjay Starts Campaign From Today, BJP Chief Bandi Sanjay Starts Campaign In Munugode, Mango News, Mango News Telugu, TRS Party, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రచారాన్ని నేటినుంచి మరింత ఉధృతం చేయనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు బీజేపీ తరపున ప్రచారాన్ని కొనసాగిస్తుండగా.. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నుంచి రంగంలోకి దిగుతున్నారు. ఇక సంజయ్ రాకతో పార్టీలో జోష్ పెరుగుతుందని, ప్రచారం మరింత హోరెత్తనుందని పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

నేటినుంచి 12 రోజుల పాటు మునుగోడు వ్యాప్తంగా రోడ్‌ షోలతో ప్రచారాన్ని నిర్వహించేందుకు బండి సంజయ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి ఈ నెల 27 వరకు ముందుండి ప్రచారాన్ని నడిపించనున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించడానికి తగిన వ్యూహరచన చేయనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులతో పాటు పలువురు జాతీయ స్థాయి నేతలతో బహిరంగ సభలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీల తదితరులను ఆహ్వానించనున్నారు. 27న నడ్డాతో, ప్రచారం చివరి రోజు నవంబర్ 1న అమిత్ షాతో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 15 =