దేశంలో 8 రాష్ట్రాల్లోని 19 రాజ్యసభ స్థానాలకు జూన్ 19, శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు స్థానాలకు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు, జార్ఖండ్ లో రెండు, మేఘాలయ, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార వైసీపీ పార్టీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ బరిలో నిలవగా, టీడీపీ పార్టీ నుంచి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ నిర్వహిస్తున్నారు, సాయంత్రం 4 గంటల వరకు పోలింగు కొనసాగనుంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలంతా ఓటింగ్ కు తప్పనిసరిగా హాజరవ్వాలని టీడీపీ పార్టీ విప్ జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu