ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ 29వ తేదీతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశమునట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గానూ మార్చ్ 31, మంగళవారం నాడు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తునట్టు సమాచారం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక బీఏసీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో ఏయే ఏయే అంశాలను చర్చించాలో నిర్ణయించనున్నారు.
[subscribe]