ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, IAS Officers Transferred, IAS Officers Transferred In Andhra Pradesh, IAS Officers Transferred In AP, Mango News Telugu, Several IAS Officers Transferred In Andhra Pradesh, Several IAS Officers Transferred In AP

ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఐఏఎస్ అధికారులను బదిలీలు చేయడంతో పాటు వారికీ కొత్త పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మున్సిప‌ల్ శాఖ క‌మిష‌నర్‌ విజయ్‌కుమార్‌‌కు ఏపీ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా పూర్తి స్థాయి అద‌న‌పు బాధ్యత‌లు అప్పగించారు. అలాగే ప్రస్తుతం ఏపీ ప్లానింగ్ సొసైటీ సీఈవో విధులు నిర్వహిస్తున్న సంజయ్ గుప్తాను బదిలీ చేస్తూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. అదే విధంగా సుమిత్‌కుమార్‌కు ‌ఏపీ ఫైబ‌ర్ నెట్ ఎండీతో పాటు ఇసుక విధానం అమలు బాధ్యతలు, ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు, మౌళిక స‌దుపాయ‌ల కల్పన ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

సీసీయల్ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్‌ గా ఉన్న ఎం.హరినారాయణ్‌కు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ‌కు ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా పూర్తి స్థాయి అద‌న‌పు బాధ్యతలు అప్పగిస్తూ, గ్రామ‌ స‌చివాల‌యాలు, గ్రామ‌ వాలంటీర్స్ శిక్ష‌ణ బాధ్యతలను కూడ కేటాయించారు. వి.కోటేశ్వరమ్మకు ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + thirteen =