ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై భారత జట్టు ఆడే మూడు టెస్టుల సిరీస్ లో రెండో టెస్టు పుణెలోని ఎంసీఏ వేదికగా నేడు ప్రారంభమైంది. విశాఖపట్నంలో జరిగిన తొలిటెస్టులో 203 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించిన భారత జట్టు ఈ టెస్టులోనూ గెలిచి సిరీస్ గెలుచుకోవడానికి సన్నద్ధమైంది. మొదటగా టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ టెస్టు మ్యాచ్కు హనుమ విహారిని అనూహ్యంగా తప్పించారు. హనుమ విహారిని జట్టునుంచి తప్పించడానికి గల కారణాలను టీమ్ మేనేజ్మెంట్ వ్యక్తపరచలేదు. అతడి స్థానంలో బౌలర్ ఉమేశ్ యాదవ్ను తుదిజట్టులోకి తీసుకున్నారు. అదేవిధంగా దక్షిణాఫ్రికా జట్టులో కూడ ఒక మార్పు చేసారు, తొలిటెస్టులో అంతగా రాణించని ఆఫ్స్పిన్నర్ పీట్ స్థానంలో పేసర్ ఎన్రిచ్ నోర్ట్జే ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇది కెప్టెన్ విరాట్ కోహ్లీకి 50వ టెస్టు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తరువాత 50 టెస్టులకు నాయకత్వం వహించిన ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ నాయకత్వం వహించిన 49 టెస్టుల్లో భారత్ జట్టు 29 మ్యాచులు గెలుచి, 10 మ్యాచులు ఓడిపోయి, 10 మ్యాచులు డ్రాగా ముగించింది.
Home స్పోర్ట్స్
- Advertisement -