ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1916 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1908 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 8 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 1916 కేసులతో కలిపి జూలై 14, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33019 కు చేరింది. గత 24 గంటల్లో 22,670 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన అనంతపూర్ లో పది మంది, పశ్చిమ గోదావరిలో తొమ్మిది మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కడపలో ఐదుగురు, కర్నూల్ లో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 408 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 17469 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,739 మంది ఆసుపత్రుల్లో, 2405 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 15144 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu