ఏపీలో పలువురు మున్సిపల్‌ ఉన్నతాధికారుల బదిలీ

Andhra Pradesh Latest News, AP Breaking News, AP Municipal Commissioners Transfered, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, Mango News Telugu, Municipal Commissioners Transfered In Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు మున్సిపల్‌ ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు జనవరి 17, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఆర్‌ఎండీఏగా విధులు నిర్వహిస్తున్న జి.శ్రీనివాసరావును రాష్ట్ర మున్సిపల్‌ కమిషరేట్‌లో జాయింట్‌ డైరెక్టరేట్‌గా బదిలీ చేశారు. అలాగే ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌ కె.వెంకటేశ్వర్లును గుంటూరు మున్సిపల్‌కార్పోరేషన్‌ ఆర్‌ఎండీఏగా నియమించారు. అదే విధంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు మున్సిపల్‌ కమిషనర్లు, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =