ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,72,839 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 7042 కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉన్నారు. గత 24 గంటల్లో 744 మంది కరోనా నుంచి రికవరీ అయినట్టు తెలిపారు. అలాగే గడిచిన 24 గంటల్లో 56,187 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,05,09,805 కు చేరుకుంది. ఇక కరోనా వలన కృష్ణాలో ఒకరు, గుంటూరులో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు, నెల్లూరులో ఒకరు మరణించారు.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 8, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,72,839
- కొత్తగా నమోదైనా కేసులు : 551
- నమోదైన మరణాలు : 4
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,60,368
- యాక్టీవ్ కేసులు : 5429
- మొత్తం మరణాల సంఖ్య : 7042
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ