వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి త్వరలో ఓ ఇంటివాడు కాబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17న అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరగనుంది. జనవరి 18న హైదరాబాద్లో వీరి ఎంగేజ్మెంట్ జరగనుంది. ప్రస్తుతం పెళ్లిక సంబంధించిన కార్యక్రమాల్లో వైఎస్ షర్మిల బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు కొడుకు, కోడలుతో కలిసి వెళ్లిన షర్మిల మొదటి శుభలేకను సమాధి వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి పెళ్లికి ఆహ్వానించారు.
ఇక ఆ తర్వాత నుంచి షర్మిల ఒక్కొక్కరిగా బంధుమిత్రులను, ప్రముఖులను కలుస్తూ తన కొడుకు పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. అయితే ఇప్పుడు జగన్ ప్రత్యర్థులను కలుస్తూ షర్మిల పెళ్లికి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి పెళ్లికి ఆహ్వానించిన షర్మిల.. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్లోని తన నివాసానికి వెళ్లి షర్మిల.. పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా శభలేఖ అందించి తన కుమారుడి పెళ్లికి రావాలని పవన్ను ఆహ్వానించారు. ఇదే సమయంలో ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయినందుకు పవన్ కళ్యాణ్కు షర్మిలకు అభినందనలు తెలియజేశారు.
ఇకపోతే తన మేనల్లుడి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జగన్ ప్రత్యర్థులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిలతో పాటు మరికొంత మందికి షర్మిల ఆహ్వానం పలికారు. పెళ్లికి వెళ్తే వారితో పాటు జగన్ కూడా ఒకే వేదికపై కనిపించాల్సి ఉంటుంది. ఈక్రమంలో పెళ్లికి జగన్ హాజరు కాకపోవచ్చని ఓవైపు ప్రచారం జరుగుతోంది. జగన్ వర్గాలు మాత్రం పెళ్లికి తప్పకుండా హాజరవుతారని అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE