ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విడుదలైన జీవోపై జనవరి 15, బుధవారం నాడు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. అలాగే నాలుగు వారాల్లోగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను 50శాతం దాటకుండా చూడాలంటూ బిర్రు ప్రతాప్రెడ్డి, బీసీ రామాంజనేయులు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. గతంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, ఆ నిబంధనను ఏపీ ప్రభుత్వం అనుసరించలేదని వారు పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 176పై స్టే విధించింది. అలాగే ఈ అంశంపై ఏపీ హైకోర్టులో దాఖలై పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లపై కూడా నాలుగువారాల్లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
[subscribe]