ఏపీలో టీడీపీ గెలుపు రాష్ట్రానికి చారిత్రక అవసరమని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఒంగోలులో నిన్నటి నుంచి జరుగుతున్న మహానాడు కార్యక్రమం నేటితో ముగిసింది. ముగింపు సందర్భంగా చంద్రబాబు భారీగా హాజరైన కార్యకర్తలనుద్దేశించి బహిరంగ వేదికపై అద్భుత ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు..
- 40 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
- ఇది నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం.
- ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తాం, ఆయన స్ఫూర్తిని ప్రజలలోకి తీసుకెళతాం.
- ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా సంతోషంగా లేరు.
- దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, మనకు మాత్రం రాజధాని ఏదో తెలియకుండా పాలన చేస్తున్నారు.
- ఆంధ్రా జీవనది అయిన పోలవరం ప్రాజెక్టులో ఒక్క అడుగు ముందుకు పడలేదు, ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు.
- ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ సాధిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తటం లేదు ముఖ్యమంత్రి జగన్.
- ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేకపోయింది, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం.
- ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాల విభజన చేసి అల్లర్లు జరగడానికి కారణమయ్యారు.
- వీటన్నింటినీ అడ్డుకోవాలంటే ఒక్క టీడీపీకే సాధ్యం, ఈసారి ఏపీలో వచ్చేది మన ప్రభుత్వమే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF