ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu To Visit Flood Affected Areas in AP on July 20-22, Chandrababu Naidu To Visit Flood Affected Areas in AP on July 20-22, TDP Chief To Visit Flood Affected Areas in AP on July 20-22, TDP President Chandrababu Naidu To Visit Flood Affected Areas in AP on July 20-22, AP Flood Affected Areas, Flood Affected Areas, TDP President Chandrababu Naidu, TDP Chief Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, AP Flood Affected Areas News, AP Flood Affected Areas Latest News, AP Flood Affected Areas Latest Updates, AP Flood Affected Areas Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన మూడు రోజుల పాటు వరదలు సంభవించిన ప్రాంతాలను సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పనున్నారని, 20,21,22 తేదీల్లో చంద్రబాబు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ముందుగా చంద్రబాబు 20వ తేదీన కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటించనున్నారు. తర్వాతి రోజు 21వ తేదీన కూనవరం, చింతూరు, ఏటపాక, వీఆర్‌పురం మండలాల్లో పర్యటన కొనసాగించనున్నారు. ఇక చివరిగా 22వ తేదీన పి.గన్నవరం, రాజోలులో వరద ప్రాంతాలను ఆయన వీక్షించనున్నారు.

ఇక రాష్ట్రంలో వరద ప్రభావంపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ .. వరద బాధితుల్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కారు విఫలమైందని, క్షేత్ర స్థాయి పర్యటన కాకుండా ఏరియల్ సర్వ్ చేస్తే బాధితుల కష్టాలు ఏం తెలుస్తాయని చంద్రబాబు విమర్శించారు. కాగా గోదావరికి భారీగా వచ్చిన వరదల కారణంగా లంక గ్రామాలతో పాటు పలు ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. గడచిన మూడు రోజులుగా అనేక గ్రామాల్లో విద్యుత్తు లేక అంధకారంలో ఉంటున్నాయి. అలాగే గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =