ఏపీలో లోన్ యాప్ ల ఆగడాల నేపథ్యంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చావు పరిష్కారం కాదని చంద్రబాబు అన్నారు. “లోన్ యాప్ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య ఘటన మరువకముందే ఈరోజు పల్నాడులో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా మహిళల గౌరవాన్ని బజారుకీడుస్తూ వేధిస్తున్న ఇలాంటి లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంతేకానీ చావు పరిష్కారం కాదు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్ ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి. బాధితులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలి” అని చంద్రబాబు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY