అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ – టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Says Capital Amaravati will Win Definitely, TDP Chief Chandrababu Naidu, Capital Amaravati will Win Definitely, Maha Padayatra Temporarily Stopped, Amaravati Farmers Stops Maha Padayatra, Mango News, Mango News Telugu, TDP Chief Chandrababu , YSR Congress Party, TDP Party, Amaravati Farmers Maha Padayatra, Perni Nani Latest News And Updates, TDP News And Live Updates

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే నిలుస్తుంది, అమరావతే గెలుస్తుంది, ఇదే ఫైనల్ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించాం. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యింది. అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పం” అని చంద్రబాబు అన్నారు.

“ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారు. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేసాడు. అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవు. ఆంధ్రుల రాజధాని అమరావతే. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుంది. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది. అమరావతే గెలుస్తుంది. ఇదే ఫైనల్” అని చంద్రబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + eight =