స్కూలు పిల్లల వరకు గంజాయి రావడం ఆందోళనకు గురి చేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు సంబంధిత వార్తను షేర్ చేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. “13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెర పరిచింది. ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే, పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టాలి. సమూలంగా గంజాయిని అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలి. రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడంలో మునిగిపోయిన ప్రభుత్వం, యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలెయ్యడం క్షమించరాని నేరం. కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY