ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ‘శ్రీ శుభకృత్’ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలుగునాట మొదటి పండుగగా భావించే ఉగాది పండుగ ప్రజలందరికీ సకల శుభాలు కలిగించాలని, ఉత్తమ సంకల్పాలతో ఈ పండుగకు ఆహ్వానం పలుకుదామని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
శుభాలను ప్రసాదించే ఈ శుభకృత్ ఉగాదిని ఉత్తమ సంకల్పాలతో ఆహ్వానిద్దాం. సత్సంప్రదాయాలతో స్వాగతిద్దాం. ఈ ఉగాది మీ ఇంట ఆనందోత్సాహాలకు ఆరంభం కావాలని, ఈ ఏడాది మీకు అన్నింటా గెలుపును అందించాలని కోరుకుంటూ… ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు#Ugadi pic.twitter.com/txgTHYwrSp
— N Chandrababu Naidu (@ncbn) April 2, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కష్టాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని, అన్నింటా గెలుపును అందించాలని చంద్రాబాబు ఆకాంక్షించారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరాదిని సత్సంప్రదాయాలతో స్వాగతిద్దామని, అలాగే ఈ ఉగాది మీ ఇంట ఆనందోత్సాహాలు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ